మైలవరం వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.కాగా ఆయన వచ్చే ఏడాది ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని తెలిపారు. అయితే నిన్న తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి రావాలని తనకు వైసీపీ అధిష్టానం నుంచి పిలువు వచ్చింది అన్నారు. కాగా తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో వైసీపీ అధిష్టానం అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల వైసీపీలో సీఎం జగన్ కీలక మార్పులు చేపట్టిన విషయం తెలిసందే. ఈ నేపథ్యంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. అయితే పార్టీపై అసంతృప్తితో ఉన్న మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం.