Home Page SliderTelangana

రాజకీయాలకు గుడ్ బై చెప్తా.. ఇక ఎన్నికల్లో పోటీ చేయనన్న మల్లారెడ్డి

Share with

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేదే లేదన్నారు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి. బెంగళూరులో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో మల్లారెడ్డి, కర్నాటక ఉపముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. తాను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని.. పార్టీ మారే ఉద్దేశం లేదని ఐదేళ్లపాటు ప్రజా సేవ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఇక శాశ్వతంగా రాజకీయాలు మానుకుంటానని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే.. మల్కాజ్‌గిరి లోక్ సభ నుంచి తన కుమారుడు పోటీ చేస్తాడని చెప్పిన ఆయన తర్వాత మనసు మార్చుకున్నారు. తన కుటుంబం నుంచి ఎవరూ కూడా ఎన్నికల్లో పోటీ చేయరని చెప్పారు.