Home Page SliderTelangana

తెలంగాణాలో రైతు రుణమాఫీ ప్రారంభించిన సర్కార్

Share with

తెలంగాణాలో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ కోసం రూ.167.59 కోట్లు విడుదల చేసింది. అయితే ఈ తొలి విడత రుణమాఫీలో తెలంగాణాలో రూ.31 వేల నుంచి రూ.41 వేల మధ్య ఉన్న రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని 44,870మంది రైతులు లబ్ది పొందినట్లు తెలుస్తోంది. అయితే సెప్టెంబర్ 2వ వారంలో విడతల వారీగా రూ.లక్షలోపు ఉన్న రుణాన్ని మాఫీ చేస్తామని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది.దీనిపట్ల తెలంగాణా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.