Home Page SliderTrending Today

‘శాకుంతలం’లో సమంతను కుందేలు కరిచిందట

Share with

‘శాకుంతలం’ సినిమా గురించి అందాలతార సమంత కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసింది. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్రేజీ విషయాలు ఐదింటిని పంచుకుంది.

 సమంతకు పూలంటే ఎలర్జీ ఉందట. కానీ భారతంలో శకుంతల ఎప్పుడూ ఆభరణాలుగా పూలనే ధరిస్తుంది. దానితో సమంతకు పూలను మెడకి, చేతికి చుట్టుకోవలసివచ్చింది. దీనితో ఆమెకు ఎలర్జీ దద్దుర్లు వచ్చాయట. అవి టాటూలాగ కన్పిస్తూ, ఆరునెలలు అలాగే ఉండిపోయాయి. షూటింగ్ సమయంలో మేకప్‌తో కవర్ చేశారట.

ఇక కష్టమైన పౌరాణిక భాషలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్వయంగా తానే డబ్బింగ్ చెప్పిందట. నిద్రలో కూడా డైలాగ్‌లు కలవరించేదట.

ఇక ఈ సినిమా సెట్‌లో చాలా కుందేళ్లు ఉండేవని, తనని ఒకటి కరిచిందని పేర్కొంది. ఆ కుందేలు క్యూట్‌గా లేదని కూడా చెప్పింది.

అన్నింటి కన్నా కష్టమైన పని ఆమె ధరించిన లెహంగా బరువు 30 కేజీలు ఉందట. దీనితో మోయలేక చాలా ఇబ్బంది పడిందట. షూటింగ్ సమయంలో చాలా సార్లు లెహంగా కారణంగా కెమెరా ఫ్రేం నుండి పక్కకు వెళ్లిపోయిందని దానితో కెమెరామెన్ అరిచేవాడని చెప్పింది. తానుకూడా ‘నేను వెళ్లడం లేదు లెహంగా తీసుకెళ్తోందని’ సమాధానమిచ్చేదట.

ఈ సినిమాలో కనిపించే జుట్టు తనది కాదని, విగ్గని చెప్పింది.

ఈ విషయాలు చదివిన నెటిజన్లు ‘సామ్, నువ్వు రియల్ క్వీన్’ అంటూ పొగుడుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో సమంత శకుంతల పాత్రను పోషించగా, దేవ్ మోహన్ దుష్యంతుని పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది. దీనితో ప్రమోషన్లు, ట్రైలర్లతో సమంతా చాలా బిజీగా ఉంది.