Home Page SliderTelangana

సోమవారం నుండి సఫారీ యాత్ర స్టాప్

Share with

టిజి: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో పర్యాటక ప్రకృతి ప్రేమికుల కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సఫారీ యాత్రను నేటి నుండి సెప్టెంబర్ 30 వరకు నిలిపివేస్తున్నట్టు నాగర్‌కర్నూల్ జిల్లా ఫారెస్ట్ అధికారి తెలిపారు. ఈ 3 నెలలు పెద్దపులులు, ఎలుగుబంట్లు, ఇతర వన్యప్రాణుల సంతానోత్పత్తికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సమయం కేటాయించాలనే ఉద్దేశ్యంతో, వన్యప్రాణులకు వాహనాలు, మనుషుల అలికిడి వంటి శబ్దాల ద్వారా ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.