Home Page SliderInternational

పిచ్‌పై మట్టి తిన్న రోహిత్ ఎందుకంటే..?

Share with

టీమిండియా T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించి పొట్టి కప్పును కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఇండియా VS సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్ బార్బడోస్‌లో జరిగింది. అయితే టీమిండియా కప్పు గెలిచిన అనంతరం కెప్టెన్ రోహిత్ బార్బడోస్ పిచ్‌పై ఉన్న మట్టిని తిన్నారు. కాగా రోహిత్ మట్టి తిన్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీంతో రోహిత్  ఆ వీడియోపై స్పందించారు. “ఆ పిచ్‌పైనే మనం ఫైనల్ గెలిచి వరల్డ్ కప్ సాధించాం. అందుకే ఆ పిచ్ ఎంతో ప్రత్యేకం. కాగా దాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను. అయితే దాన్ని నేను నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే అలా మట్టి నోట్లో వేసుకున్నాను” అని రోహిత్ స్పష్టం చేశారు.