Home Page SliderNational

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రిషబ్ పంత్ సందడి

Share with

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కొన్ని రోజుల క్రితం జరిగిన  కారు ప్రమాదంలో తీవ్రంగా  గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో ఆయన ఈ ఏడాది IPLసీజన్‌కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో పంత్ త్వరగా కోలుకోవాలని తన తోటి క్రికెట్ ప్లేయర్స్‌తో పాటు పంత్ అభిమానులంతా కోరుకున్నారు. అయితే అనుకున్న దానికన్న పంత్ చాలా వేగంగానే కోలుకున్నట్లు తెలుస్తోంది. కాగా పంత్ ప్రమాదం జరిగిన కొన్ని రోజులు స్టిక్ సహయంతో నడిచారు. అయితే ప్రస్తుతం ఆయన ఎటువంటి స్టిక్ సహాయం అవసరం లేకుండా స్వయంగా నడుస్తున్నారు. తాజాగా స్టిక్ లేకుండా నడుస్తూ.. రిషబ్ పంత్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. రిషబ్ పంత్ ఇప్పటికే గాయాల కారణంగా IPL,WTC ఫైనల్‌కు దూరమయ్యారు. ఈ క్రమంలో పంత్ పూర్తిగా కోలుకోని మళ్లీ మ్యాచ్‌ల్లో అదరగొట్టాలని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.