TPCC చీఫ్గా రేవంత్ ఇద్దరి పేర్లు సిఫార్సు..?
తెలంగాణలో కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 రోజుల ఢిల్లీ టూర్ పూర్తయింది. మంత్రివర్గ విస్తరణతో పాటుగా టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు.. నామినేటెడ్ పదవుల భర్తీ పైన పార్టీ నాయకత్వంతో రేవంత్ చర్చలు చేశారు. ప్రధానంగా టీపీసీసీ చీఫ్ విషయంలో రేవంత్ ఇద్దరి పేర్లను సిఫార్సు చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్ గౌడ్ లేక మహబూబాబాద్ ఎంపీ బల్రాం నాయక్ పేర్లను రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్టు సమాచారం.