రేవంత్.. టీఆర్ఎస్తో కుమ్మక్కయ్యావా..?
`రేవంత్.. టీఆర్ఎస్తో కుమ్మక్కయ్యావా?` అని కాంగ్రెస్ నుంచి ఇటీవల బీజేపీలోకి వెళ్లిన దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీతో కలిసి సీఎం కేసీఆర్ మతకలహాలకు చేస్తున్న కుట్రను బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బహిర్గతం చేస్తే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నొప్పి ఎందుకని ఎద్దేవా చేశారు. కరీంనగర్లో బీజేపీ నిరసన కార్యక్రమం సందర్భంగా బండి సంజయ్, దాసోజు శ్రవణ్ మాట్లాడుకుంటున్న వీడియోను రేవంత్ ట్విటర్లో విడుదల చేస్తూ.. `హైదరాబాద్లో మత ఘర్షణలపై బండి సంజయ్ మనసులో మాట ఇది. ఈ గుసగుసలు ఏ కుట్ర కోసం? వీళ్లా నాయకులు.. ఇలాంటి క్రూర సిద్ధాంతం కలిగిన పార్టీని ఏం చేయాలో తెలంగాణ సమాజమే ఆలోచించాలి` అని కామెంట్ చేశారు.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2022/08/revanth.jpeg)
దీనిపై దాసోజు స్పందిస్తూ.. `సోషల్ మీడియాలో అసత్యాలు, అర్ధ సత్యాలతో సొంత పార్టీ నాయకులపైనే కుట్రలు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీని బలహీన పరుస్తున్న రేవంత్రెడ్డి పరిస్థితి కుక్క తోకకు గుండ్రాయి కట్టినా సక్కగ కానట్లు ఉందని విరుచుకుపడ్డారు. రేవంత్ ఆరోపణలు నిజమని తేలితే తాను నమ్మే కనకదుర్గ అమ్మ వారి సాక్షిగా జీవితంలో మళ్లీ రాజకీయాల జోలికి వెళ్లబోనని, ఒకవేళ రేవంత్ చెప్పేది అబద్ధమని తేలితే మూసుకుని కూర్చుంటాడా? అని సవాల్ విసిరారు.