అప్పులకుప్పగా తెలంగాణ..శ్వేతపత్రం విడుదల చేసిన రేవంత్ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పులకుప్పగా మారిందని వ్యాఖ్యానించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై నేటి అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది.
శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలు.
తెలంగాణ మొత్తం అప్పులు – రూ.6,71,757 కోట్లు
2014-15 నాటికి అప్పు -రూ. 72,658 కోట్లు
2014-2015 నుండి 2022-23 మధ్య సగటున 24.5 శాతం పెరిగిన అప్పులు.
2023-2024 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం – రూ. 3,89,673 కోట్లు.
2015-16 లో తెలంగాణ రుణ, జీఎస్టీపీ 15.7 శాతం. ఇది దేశంలోనే తక్కువగా నమోదయ్యింది.