Andhra PradeshHome Page Slider

సీఎం జగన్ కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం: మంత్రి రోజా

Share with

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ  పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలనే దానిపై ఇప్పటికే సీఎం జగన్ కసరత్తులు ప్రారంభించారు.ఈ మేరకు ఆయన నిత్యం వైసీపీ మంత్రులు ,ఎమ్మెల్యేలతో భేటి అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులకు,సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా టికెట్ దక్కదని ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రచారం చేస్తుంది. దీనిపై మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి జరిగినా ముందు వరుసలో ఉండేది నేనే అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానన్నారు. కాగా సీఎం జగన్ మాటే నాకు శిరోధార్యం అన్నారు. ఏపీలో నేను జగనన్న సైనికురాలిని అని రోజా తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నాకు సీటు ఇవ్వకున్నా సీఎం జగన్ వెంటే ఉంటానన్నారు. కాగా సీఎం జగన్ కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధమే అని రోజా పేర్కొన్నారు. ఈసారి జగనన్నతో కలిసి మిషన్ 175/175లో భాగమవుతానని మంత్రి రోజా స్పష్టం చేశారు.