Home Page SliderTelangana

రామోజీరావు మృతి.. రేపు షూటింగ్‌లకు సెలవు

Share with

ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఇవాళ ఉదయం కన్నుమూశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల దేశంలోని సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.కాగా ఆయన పార్థీవ దేహానికి ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే రామోజీరావు మృతికి సంతాప సూచికగా రేపు సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించినట్లు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలిపారు. కాగా రేపు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య తెలంగాణా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో  ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంచిన రామోజీరావు పార్థివ దేహానికి పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.