Home Page SliderTelangana

సొంతగూటికి చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Share with

ఈ మధ్య కాలంలోనే  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా కూడా చేశారు. దీంతో రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గమైన మునుగోడులో ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఉపఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. అయితే మునుగోడులో బీజేపీ పార్టీ ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన మెజార్టీని సొంతం చేసుకుంది. దీంతో తెలంగాణాలో బీజేపీ బలపడుతుందని బీజేపీ శ్రేణులు భావించారు. అయితే తాజాగా  బీజేపీలో కీలక పరిణామాల చోటు చేసుకుంటున్నాయి. కాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గతకొన్ని రోజులుగా బీజేపీ పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటి అయ్యారు. అయితే రాజగోపాల్‌రెడ్డి తిరిగి సొంత గూటికి చేరేందుకే ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. కాగా ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో వీరిద్దరి భేటి ప్రాధాన్యం సంతరించుకుంది.