Home Page SliderTelangana

మోదీని పోషిస్తుంది రాహుల్ గాంధీనే:జగదీష్ రెడ్డి

Share with

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణాపై ఎక్కువగా కన్పిస్తోంది. కాగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించడంతో తెలంగాణాలోని కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. దీంతో వారు ఎన్నడు లేని విధంగా మరింత ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నిన్న ఖమ్మంలో జనగర్జన సభను ఏర్పాటు చేసింది. అయితే ఈ భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కాగా ఈ సభకు ముఖ్య అతిధిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సభలో రాహుల్ గాంధీ బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే వీటిపై బీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఖమ్మం సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అంతేకాకుండా దేశంలో BJP కి BRS బీ టీమ్ కాదని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అయినా రాహుల్ గాంధీ ఏ హోదాలో ఖమ్మం సభలో మాట్లాడారని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణా ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కాబట్టే..తెలంగాణా కేసీఆర్ జాగీరే అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో మోదీని పోషిస్తుంది రాహుల్ గాంధీనే అని జగదీష్ రెడ్డి విమర్శించారు.