Home Page SliderNational

సుప్రీమ్ కోర్టు మెట్లెక్కిన రాహుల్ గాంధీ

Share with

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీమ్ కోర్టు మెట్లు ఎక్కారు. ఎందుకంటే రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ పిటిషన్ దాఖలు చేశారు.  ఇటీవల రాహుల్ గాంధీ సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీ దీనిపై సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు.కాగా గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ రాహుల్‌పై పరువు నష్టం దావా వేయడంతో కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.