Home Page SliderNational

అదానీ గ్రూప్‌పై రాహుల్ గాంధీ ఫైర్

Share with

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి అదానీ గ్రూప్‌పై మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదానీ గ్రూప్‌పై దర్యాప్తు చేయిస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు. ప్రధాని మోదీ నిజాయితీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. మోదీ జీ ఇప్పటికైనా అదానీపై దర్యాప్తునకు ఆదేశించండి అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అయితే బొగ్గును మార్కెట్ విలువ కంటే ఎక్కువ ధరకు అదానీ దిగుమతి చేసుకుంటున్నట్లు టైమ్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కాగా ఈ కథనాన్ని   చూపిస్తూ అదానీ ప్రజల నుంచి నేరుగా దోచుకుంటున్నారని రాహుల్ గాంధీ  ఆరోపించారు.