Home Page SliderNational

రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో విచారణ వాయిదా

Share with

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో తనకు గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ..ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ వేసిన ఈ పిటిషన్‌ గురించి సుప్రీంకోర్టు విచారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతివాదులు, గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను ఆగస్టు 4 నాటికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. కాగా ఈ పరువు నష్టం కేసును విచారించిన గుజరాత్ కోర్టు  ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.