“ ఇది రాహుల్కు కోలుకోలేని, మానలేని గాయం” సూరత్ కోర్టులో రాహుల్ లాయర్ వ్యాఖ్య
నేడు సూరత్ కోర్టులో రాహుల్ గాంధీపై పరువునష్టం కేసులో తీర్పుపై అప్పీల్ విచారణ జరిగింది. రాహుల్ గాంధీ తరపున అతని లాయర్ వాదిస్తూ ఇది కావాలని చేసిన అభియోగమని, రాహుల్కు కోలుకోలేని, మానలేని గాయం తగిలిందని వ్యాఖ్యానించారు. దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఉంటుందెందుకో అన్నరాహుల్ మాటలపై ప్రధాని మోదీ ఇంటిపేరుపై రాహుల్ వ్యాఖ్యలకు సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్షను విధించింది. దీనితో లోక్సభ సభ్యత్వం కూడా రద్దయ్యింది. దీనిపై రాహుల్ అప్పీల్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.