రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించిన పురంధేశ్వరి
ఏపీ బీజేపీ ఛీఫ్,ఎంపీ పురంధేశ్వరి రాహుల్ గాంధీ నిన్న లోక్సభలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.ఆమె మాట్లాడూతూ..రాహుల్ హిందువులపై మాటల దాడికి దిగారన్నారు.దేశంలో హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్న ఎన్నో కోట్లమందిని రాహుల్ అవమానించారని ఆమె ఆరోపించారు. కాగా దేశంలో ఎమర్జెన్సీ విధించిన వాళ్లు నీతులు చెప్పడం విడ్డూరమని పురంధేశ్వరి పేర్కొన్నారు.