Home Page SliderNational

మధ్యప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం

Share with

కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల దేశంలోని 5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణా,మధ్యప్రదేశ్ ,ఛత్తీస్‌ఘడ్,మిజోరాం,రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఈ రాష్ట్రాలలోని పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి.ఈ నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రియాంక ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ..మధ్యప్రదేశ్‌లో మహిళలపై రికార్డు స్థాయిలో  అఘాయిత్యాలు జరుగుతున్నాయి అన్నారు. కాగా బీజేపీ పాలనలో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని ప్రియాంక గాంధీ వెల్లడించారు.