Home Page SliderNational

ఓటింగ్‌పై ఎన్నికల కమీషన్ వినూత్న ప్రయోగాన్ని మెచ్చుకున్న ప్రధాని మోదీ

Share with

కర్ణాటక ఎలక్షన్ సమీపిస్తున్న సందర్భంగా భారత ఎన్నికల కమీషన్ ఓటర్లకు వినూత్న పద్దతిలో ఓటుపై అవగాహన కల్పిస్తోంది. ఉడిపి జిల్లాలో నదిలో కాయకింగ్ బోట్లు మే 10 వ తేదీన ఎన్నికల తేదీని గుర్తు చేస్తూ మే 10 ఆకారంలో ఏర్పడ్డాయి.

దీనిని షేర్ చేసిన ఎన్నికల కమీషన్ చర్యను ప్రధాని మోదీ ఇది మంచి ఇన్నొవేటివ్ ఐడియా అంటూ మెచ్చుకున్నారు. కర్ణాటక అంతటా ఓటర్ల సంఖ్యను మెరుగు పర్చడానికి ఇలాంటి చర్యలు తోర్పడతాయని ట్విటర్‌లో పేర్కొన్నారు.  ఎన్నికల కమిషన్ పేజీని, వీడియోను  తన ట్విటర్‌లో షేర్ చేశారు.