Home Page SliderTelangana

విల్లెక్కుపెట్టిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Share with

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవకారుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ముగింపు ఉత్సవాలలో పాల్గొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ ఉత్సవాలు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగాయి. ఈసందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆమెకు విల్లు, బాణం బహుకరించారు. దీనితో ఆ విల్లును ఎక్కుపెట్టారు రాష్ట్రపతి. ఈ కార్యక్రమంలో రాష్ట్రగవర్నర్ తమిళిసై తెలుగులో ప్రసంగించారు. త్యాగాల తోనే కలలు సాకారమవుతాయని అల్లూరి జీవితం మనకు తెలియజేసిందని ఆమె కొనియాడారు. సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలు రాష్ట్రపతిని ఘనంగా సత్కరించారు.