Home Page SliderTelangana

గ్రేటర్ కంటోన్‌మెంట్ ప్రాంతాల విలీనానికి సిద్ధం

Share with

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్‌మెంట్ బోర్డు పరిధిలో సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలియజేశారు. కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ న్యూఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులతో వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న సీఎస్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్రమంత్రికి తెలియజేశారు.