Home Page SliderTelangana

నాడు రేవంత్, బండి ఫోన్లు ట్యాప్ చేసిన ప్రణీత్ రావు… వెలుగులోకి సంచలన విషయాలు….

Share with

ప్రభుత్వ పెద్దల మద్దతుంటే ఇక తమకు తిరుగుండదని కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. కొన్నిసార్లు అవి తాత్కాలికంగా లబ్ధి పొందేందుకు అవకాశమిచ్చినా.. చివరాకరకు అవి బూమ్ రాంగ్ అవుతాయి. ప్రభుత్వ పెద్దలు ఒకటి చెబితే, ఇంకొటి సొంతానికి చేసుకునే అధికారులు కొకొల్లలు. తాజాగా నాటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ముఖ్యనేత బండి సంజయ్ ఫోన్లను ట్యాప్ చేసిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో డీఎస్పీ దుగ్యాల ప్రదీప్ రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా.. ప్రభుత్వం మారిన తర్వాత ఈ విషయాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకు హార్డ్ డిస్కులను సైతం మాయం చేసిన ఆరోపణలపై ప్రణీత్ రావును డీజీపీ రవి గుప్తా సస్పెండ్ చేశారు.

తెలంగాణలో డీఎస్పీగా పనిచేస్తున్న ప్రణీత్ రావును సస్పెండ్ చేస్తూ డిజిపి ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు ఫోన్‌ ట్యాప్‌ చేశారని డీజీపీ రవి గుప్తా చెప్పారు. విధులకు విరుద్ధంగా ఘోరమైన దుష్ప్రవర్తనను ప్రదర్శించారని, తన అధికారిక పదవిని దుర్వినియోగం చేశారని, నిరంకుశ ప్రవర్తనను ప్రదర్శించారని, సంపూర్ణ సమగ్రతను కొనసాగించడంలో విఫలమయ్యారని, చట్టపరమైన ఉల్లంఘనకు పాల్పడ్డారని తన దృష్టికి వచ్చిందని డీజీపీ పేర్కొన్నారు. SIB బృందం కోసం ప్రత్యేకంగా ఉపయోగించేందుకు ఉద్దేశించిన అంకితమైన లీజ్డ్ లైన్ ఇంటర్నెట్ కనెక్టివిటీని ప్రణీత్ రావు ఉపయోగించుకున్నారని DGP నోటీసులో పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ప్రణీత్ రావు సస్పెన్షన్ వెనుక సంచలన అంశాలు బయటకు వచ్చాయి. పోలీస్ శాఖకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అత్యంత కీలకం. అలాంటి ఇంటలిజెన్స్ వ్యవస్థ అయిన SIB లో డీఎస్పీగా పని చేశాడు ప్రణీత్ రావ్. SIB లో ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి పలువురు సిబ్బందిని తన టీమ్ గా నియమించుకొని ప్రతిపక్ష నాయకుల ఫోన్ లు ట్యాప్ చేశాడు. డేటా అనాలసిస్ పేరుతో ఎస్ఐబి కార్యాలయంలోని ఒక రూమ్ మొత్తాన్ని తన అధీనంలోకి తీసుకొని ఫోన్ ట్యాపింగ్ నిర్వహించాడు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పలువురు కీలక నేతలు బండి సంజయ్ కిషన్ రెడ్డి లాంటి నేతల ఫోన్లను టాప్ చేసినట్టు స్పష్టమైన ఆధారాలు బయటపడ్డాయి.

ఎస్ఐబీ కార్యాలయంలో ఉన్న లాగర్ రూమ్ లో ఉన్న డేటా మొత్తాన్ని ప్రభుత్వం మారగానే ప్రణీత్ రావు చెరిపేశారు. ఈ లాగర్ రూమ్ లో ఏ ఏ లీడర్ కు సంబంధించిన ఫోన్లు ఎన్నిసార్లు ట్యాప్ చేశారో, ఏ సమయాల్లో ట్యాప్ చేశారో వంటి వివరాలు ఉండేవి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఎస్ఐబి కార్యాలయంలో ఉన్న ఈ రికార్డులను అన్నిటిని ధ్వంసం ప్రణీత్ రావు ధ్వంసం చేశాడు. కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలు స్విచ్ ఆఫ్ చేసి రికార్డులను తొలగించాడు. సాధారణంగా ఈ రికార్డులు మొత్తం కూడా హార్డ్ డిస్క్‌లో స్టోర్ చేసి ఉన్నాయి. ఆ హార్డ్ డిస్క్‌లు, ధ్వంసంతోపాటు లాప్టాప్‌లో ఉన్న వివరాలను సైతం ప్రణీత్ రావ్ తొలగించాడు. తాను చేసే పని ఎక్కడ సీసీ కెమెరాలు రికార్డు కాకుండా ఉండేందుకు ఒక ఎలక్ట్రిషన్ సహాయం తీసుకున్నాడు.

సీసీ కెమెరాలు ఆఫ్ చేసి, హార్డ్ డిస్క్‌లో ఉన్న డేటా మొత్తాన్ని ధ్వంసం చేశాడు. ఈ విధంగా మొత్తం 42 హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్టు ఆధారాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంపైనే అతడిని తక్షణమే సస్పెండ్ చేస్తూ డిజిపి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ప్రణీత్ రావ్ పోస్టింగ్ పైనా అనేక వివాదాలు చుట్టుముట్టాయి.2007 బ్యాచ్ ఎస్ఐగా ఉన్న ప్రణీత్ రావుకు అనది కాలంలోనే డిఎస్పీగా ప్రమోషన్ వచ్చిన విధానం పైన కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.. ఎస్ఐగా ఉద్యోగం వచ్చిన అనతి కాలంలోనే డీఎస్పీగా ఆక్సిలరీ ప్రమోషన్ పొందటం ఆషామాషీ వ్యవహారం కాదంటున్నారు అధికారులు. 2007లో ఎస్సైగా ఉద్యోగం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం నల్గొండ జిల్లాలోని ప్రణీత్ రావు విధులు నిర్వర్తించాడు.


రూల్ ప్రకారం సీఐగా ఉద్యోగం వచ్చినప్పటికీ ఏడాది తిరిగేలోపే డీఎస్పీగా ఆక్సిలరీ ప్రమోషన్ పొందాడు. గత ప్రభుత్వ హయాంలో ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ప్రణీత్ రావు ఎస్ఐబిలో చేరాడు. మావోయిస్టులకు సంబంధించిన ఆపరేషన్స్‌లో పాల్గొనడంలో కీలక పాత్ర పోషించాడని ఆయనకు రివార్డులు కూడా ఇచ్చారు. దీంతో ఆక్సిలరీ ప్రమోషన్‌ను ప్రణీత్ రావుకు సర్కారు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్‌తో పాటు ఆయన పోస్టింగ్ పైన వివాదం రాజుకున్న నేపథ్యంలో ప్రణీత్ రావు పై శాఖపరమైన చర్యలు తీసుకుంటూ అతన్ని వెంటనే విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్టు డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీలో ప్రణీత్ రావు విధులు నిర్వర్తిస్తున్నాడు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా హెడ్ క్వార్టర్ దాటి వెళ్లరాదని జారీ చేశారు.