ఏపీలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ వాయిదా
ఏపీలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. కాగా ఏపీలో ఈ నెల 3నుంచి వెబ్ ఆప్షన్ల్ నమోదు ప్రక్రియ ప్రారంభం కావాల్సివుంది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కాలేజీలు, సీట్లు, ఫీజులకు సంబంధించిన వివరాలను ఇంకా ప్రకటించలేదు. దీంతో వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఫీజులపై ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు సూచన ప్రకారం ప్రభుత్వం కొత్త ఫీజులను నిర్ణయించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మరింత ఆలస్యం కానుంది. దీంతో ఈ ఏడాది ఇంజనీరింగ్లో చేరబోయే విద్యార్థులకు తరగతులు మరింత ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి.