Telangana

మునుగోడులో మరోసారి వెలసిన పోస్టర్లు

Share with

మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో మరోసారి పోస్టర్ల వెలిశాయి. ఈసారి ఓటర్లకు హితవు పలుకుతూ చండూరు మండలంలో వినూత్న పోస్టర్లు దర్శనమిచ్చాయి. నోట్లకు, మద్యానికి ఓటు అమ్ముకోవద్దంటూ విజయ విహారం మాస పత్రిక పేరుతో ఈ పోస్టర్లను ముద్రించారు. నోటుకు ఓటు అమ్ముకున్న మనిషి బతికున్న శవంతో సమానమంటూ రాసి ఉన్న పోస్టర్లను గోడలకు అంటించారు. నోట్లకు, మద్యానికి ఐదేళ్ల భవిష్యత్తును అమ్ముకోవద్దని పోస్టర్లో సూచించారు. సంక్షేమం, సామరస్యం, సామాజిక న్యాయం అభ్యుదయం, నీతి, అర్హత, నిబద్ధత, సమర్థతకు ఓటు వేయండి అని పిలుపునిచ్చారు. సమర్థంగా ఓటు హక్కును వినియోగించుకుని దేశాన్ని మార్చాలని కోరారు.