Andhra PradeshHome Page Slider

కన్నుల పండుగగా తిరుమలలో  ‘పౌర్ణమి గరుడసేవ’

Share with

ఆ ఏడుకొండలపై కొలువున్న మలయప్ప స్వామికి పౌర్ణమి నాటి రాత్రి కనుల పండుగగా గరుడ సేవ జరుగుతుంది. తన ప్రియ వాహనమైన గరుడునిపై ఎక్కి సర్వాలంకార భూషితుడై శ్రీవారు అత్యంత వైభవంగా తిరుమల మాడవీధులలో భక్త జనులకు దర్శనమిస్తారు. ఈ రోజు(సోమవారం) పౌర్ణమి పైగా గురు పౌర్ణమి కావడంతో ఈరోజు జరుగబోయే పౌర్ణమి గరుడ సేవ ప్రత్యేకంగా, కన్నుల విందుగా జరగనుంది. ఈ సేవ రాత్రి ఏడు గంటల నుండి 9 గంటల వరకూ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని స్వయంగా వెళ్లి చూడలేని వారు టీటీడీ నిర్వహిస్తున్న భక్తి రస ఛానెల్ ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.