Andhra PradeshHome Page Slider

ఏపీలో పాలిసెట్ ఫలితాలు విడుదల

Share with

ఏపీలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి.కాగా ఈ పాలిసెట్ ఫలితాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజయవాడలో విడుదల చేశారు. అయితే ఈ పాలిసెట్ ఫలితాల్లో 86.5% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షకు మొత్తం 1,43,625 మంది విద్యార్థులు హాజరయ్యినట్లు అధికారులు తెలిపారు. అయితే వారిలో 1,24,021 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్ పరీక్షను మే 10న నిర్వహించగా..కేవలం 10 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించారు.ఈ పాలిసెట్ పరీక్షల్లో 15 మంది విద్యార్థులు సత్తా చాటారు. కాగా వీరు 120కి 120 మార్కులు సాధించినట్లు అధికారులు ప్రకటించారు.