సికింద్రాబాద్లో పోలీసుల కార్డెన్ సెర్చ్ ఆపరేషన్
సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రెజిమెంటల్ బజార్లో పోలీసులు గురువారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఐదుగురు రౌడీషీటర్లతో పాటు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఎలాంటి డాక్యుమెంట్లు లేని 25 టూ వీలర్లను, 5 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన రౌడీషీటర్ల నేర చరిత్ర పరిశీలిస్తున్న పోలీసులు.