Home Page SliderTelangana

పీఓకే మనదే.. అక్కడ 24 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయన్న: అమిత్ షా

Share with

ఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదేనని.. అందుకే అక్కడ సీట్లను రిజర్వ్ చేసి పెట్టామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన రెండు కీలక బిల్లులను లోక్‌సభ బుధవారం ఆమోదించింది.

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దుచేసి అక్కడ అసెంబ్లీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ బిల్లు-2023, జమ్మూకశ్మీర్ రీ-ఆర్గనైజేషన్ బిల్లు-2023 ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. వాటికి దిగువసభ బుధవారం ఆమోద ముద్ర వేసింది.