Andhra PradeshHome Page Slider

ఏడుస్తోందని చిన్నారిని చంపేసిన పిన్ని

Share with

జబల్‌పూర్‌: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుక్కపెట్టి ఏడుస్తూ నిద్రపోనివ్వకుండా చేస్తోందన్న ఆగ్రహంతో రెండేళ్ల చిన్నారిని సొంత పిన్ని గొంతు నులిమి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్ షకీల్, అతడి సోదరుడు ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. షకీల్ రెండేళ్ల కుమార్తె సోమవారం మధ్యాహ్నం తన పిన్ని గదిలోకి వెళ్లింది. తనకు నిద్ర వస్తోందని, తల్లి దగ్గరికి వెళ్లమని నిందితురాలు చిన్నారికి చెప్పింది. అందుకు ఆ బాలిక అంగీకరించకోవడంతో చెంపదెబ్బ కొట్టింది. దీంతో ఆ చిన్నారి పెద్దపెట్టున ఏడుస్తుండడంతో ఆగ్రహించిన నిందితురాలు బాలిక గొంతు పిసికి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని సోఫాకింద దాచిపెట్టింది. చిన్నారి తల్లిదండ్రులు తమ పాప కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించగా చిన్నారి ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో ఇంట్లో తనిఖీలు చేపట్టగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.