గుర్రాలే రవాణా సాధనంగా వాడుతున్న ప్రజలు
ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులు మారడం లేదని పలు గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంతగిరి గ్రామీణం: ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులు మారడం లేదని పలు గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతగిరి మండలంలోని మారుమూల మడ్రేవు, తునిసీబు, దాయర్తి, గుర్రాలబయలు తదితర గ్రామాల ప్రజలు తమకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ బుధవారం గుర్రాలతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రహదారి లేని కారణంగా ఏళ్ల తరబడిగా గుర్రాలను ఆశ్రయించి రవాణా సౌకర్యం పొందుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు గోవిందు తదితరులు పాల్గొన్నారు.