Andhra PradeshHome Page Slider

జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ ఏకగ్రీవ ఎన్నిక

Share with

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా ఇవాళ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శాసససభ పక్ష సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తొలుత పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించగా మిగతా సభ్యులందరూ దానిని ఆమోదించారు. అయితే రేపు సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు క్యాబినెట్ ఏర్పాటు జరగనుంది.అయితే ఈ క్యాబినెట్‌లో ఎవరికి ఏ పదవి దక్కుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా చంద్రబాబు క్యాబినెట్‌లో పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయి.