ఒక్కఛాన్స్ ఇస్తే సుపరిపాలన చవి చూపిస్తానంటున్న పవన్
ఆంధ్రప్రదేశ్ లో ఈసారి వచ్చేది జనసేన ప్రభుత్వమేనని జనసేనాని పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ ఇస్తే చేసి చూపిస్తానంటూ, అవినీతిని కూకటి వేళ్లతో పెకలించి పారేస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని కత్తిపూడి సెంటర్లో తొలిసారిగా వారాహి రథం పై నుంచి విజయ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అశేష జనావాహినిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదని నవంబర్ లేదా డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే మే లో మాత్రమే ఎన్నికల జరుగుతాయంటూ ప్రజల్ని రాజకీయ పార్టీలని మభ్యపెడుతున్నారని ఆయన ఇప్పటికే ఎన్నికల కమిషన్ తో కూడా సంప్రదింపులు జరిపినట్లు పవన్ వెల్లడించారు.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/06/image-67-1024x683.png)
ఇప్పటివరకు రాష్ట్రంలో ఎవరెవరికో పట్టం కట్టారు ఎవరెవరో పాలనా విధాలనాలని రుచి చూశారు జనసేనకు ఒక అవకాశం ఇవ్వండంటూ ప్రజలను పవన్ విజ్ఞప్తి చేశారు. తను ఎలాంటి స్వార్థంతో రాజకీయాల్లోకి రాలేదని కేవలం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీని స్థాపించానన్నారు. తన చివరి శ్వాస వరకు ఈ నెల పైనే ఉంటానని ఈసారి ఎన్నికల్లో ప్రజలంతా జనసేనకు మద్దతు ఇవ్వాలన్నారు. ఎన్నికల అనంతరం జనసేన ప్రభుత్వాన్ని స్థాపించి తీరుతామంటూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డంకా బజాయించారు. వచ్చేది ప్రజా ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు.