500 మంది పిల్లలకు ఆదిపురుష్ చిత్రం చూపించిన పల్నాడు జిల్లా కలెక్టర్
పల్నాడు జిల్లా కలెక్టర్ మంచి మనసు చాటుకున్నారు. రామాయణాన్ని పిల్లలందరూ చూడాలనే ఉద్దేశంతో శ్రీరామునిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రాన్ని 500 మంది పిల్లలకు చూపించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఆదిపురుష్ సినిమాకు కలెక్షన్స్ రావడమే కాదు వేల సంఖ్యలో టికెట్లు కొని, అనాధ పిల్లలకు, పేదవారికి ఈ చిత్రాన్ని చూపిస్తున్నారు చాలామంది ప్రముఖులు, సెలబ్రెటీలు. గతంలో రణబీర్ కపూర్ కూడా పదివేల టికెట్లు కొని ముంబైలో మురికి వాడల పిల్లలకు ఈ చిత్రాన్ని చూపించారు. అలాగే పలువురు నిర్మాతలు, హీరోలు కూడా ఈ బాటలో నడుస్తున్నారు. ఇప్పుడు ఈ కలెక్టర్ కూడా ఇలా చేయడంతో ఈ వీడియోలు వైరల్గా మారాయి.