Telangana

టీఆర్ఎస్‌లోకి పల్లె రవి కుమార్ దంపతులు

Share with

మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి, భంగపడ్డ పల్లె రవికుమార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి గులాబీ పార్టీ లో చేరారు. చండూరు ఎంపీపీగా కొనసాగుతున్న ఆయన భార్య కళ్యాణి కూడా టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి గౌడ సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్య గౌడ్ బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవగా… ఆ స్థానంలో గౌడ సామాజిక వర్గం నుండి పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కీంగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పల్లె రవికుమార్ ఆయన సతీమణికి గులాబి కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.