Andhra PradeshHome Page Slider

మాట నిలబెట్టుకున్న పద్మనాభం

Share with

వైసీపీ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం,కాపు నేత మాట నిలబెట్టుకున్నారు. కాగా పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆయన పేరును మార్తుస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.కాగా ఇటీవల వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు.దీంతో పద్మనాభం ఇచ్చిన మాట ప్రకారం తన పేరును మార్చుకున్నారు.