మాట నిలబెట్టుకున్న పద్మనాభం
వైసీపీ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం,కాపు నేత మాట నిలబెట్టుకున్నారు. కాగా పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆయన పేరును మార్తుస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.కాగా ఇటీవల వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు.దీంతో పద్మనాభం ఇచ్చిన మాట ప్రకారం తన పేరును మార్చుకున్నారు.