Home Page SliderTelangana

నిరసనసెగలతో హోరెత్తిన ఉస్మానియా

Share with

తెలంగాణాలో TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం రగిలించిన సెగ ఇప్పట్లో చల్లారేలా కన్పించడం లేదు. దీని విషయమై విద్యార్థి సంఘాల నాయకులు,ABVP కార్యకర్తలు ప్రతిరోజు ఉస్మానియా ఎదుట ఆందోళనలు చేపడుతున్నారు. కాగా ఈ రోజు కూడా వారు ఆందోళనలు ఉధృతం చేయడంతో ప్రస్తుతం ఉస్మానియా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు ABVP నాయకులు  భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పేపర్ లీకేజీకి కేసీఆర్ బాధ్యత వహిస్తూ..రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా కవిత లిక్కర్ స్కాం చేస్తే కేటీఆర్ పేపర్ స్కాం చేశారని నినాదాలు చేశారు. కాగా అక్కడికి చేరుకున్న పోలీసులు ర్యాలీని అడ్డుకుని విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.