Home Page SliderNational

పార్లమెంటులో మోదీ ప్రసంగంపై విపక్షాల రచ్చ

Share with

ఈ రోజు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో భాగంగా ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రసంగించారు. అయితే మోదీ ప్రసంగానికి విపక్ష నేతలు అడుగడునా ఆటంకాలు కలిగించారు. కాగా ప్రధాని మోదీ అబద్దాలు ఆపాలంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు.అయితే విపక్ష సభ్యుల నినాదాల మధ్యే ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. మోదీ మాట్లాడుతూ.. ప్రజలు గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ దేశప్రజల నిర్ణయాన్ని త్కకువచేసి చూపే ప్రయత్నం చేస్తుందని మోదీ మండిపడ్డారు.దేశప్రజలు పెద్ద మనస్సుతో మమ్మల్ని ఆశీర్వాదించారన్నారు.కాగా రాబోయే 5ఏళ్లల్లో మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని ఆయన తెలిపారు. దేశంలో అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని మోదీ వెల్లడించారు.రాబోయే రోజుల్లో దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దుతామన్నారు. విపక్షాలు మా విజయాన్ని చూసి ఓర్వలేక పోతున్నాయని మోదీ వ్యాఖ్యానించారు.