Home Page SliderNational

మోడీ ప్రసంగానికి అడ్డుపడుతున్న విపక్షాలు

Share with

రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి దేశానికి మార్గదర్శనం చేశారని, వికసిత్ భారత్ లక్ష్యాలను వివరించారని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో తమను మూడోసారి ఎన్నుకున్నారని వివరించారు. అయితే, మోడీ ప్రసంగానికి విపక్షాలు అడ్డుతగులుతున్నాయి. నీట్, మణిపూర్ అంశంపై మాట్లాడాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రతిపక్ష నేతలపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.