NewsTelangana

ట్యాంక్ బండ్ వద్ద కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు

Share with

తెలంగాణాలో నిన్న ప్రారంభమైన గణేష్ నిమజ్జనాలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనానికి గణనాథులు బారులు తీరారు. దీంతో అక్కడ రద్దీ వాతావరణం నెలకొంది. అయితే ఈ గణేష్ నిమజ్జనాలు పూర్తవ్వటానికి మధ్యాహ్నం వరకు సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ గణేష్ నిమజ్జనాల కోసం అధికారులు నగరంలో ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అధికారులు ఈ నిమజ్జనాల కోసం నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు.