అగ్ని ప్రమాదంలో ఒకరి సజీవదహనం..
హైదరాబాద్లోని బొగ్గుల కుంటలోని ఓ కారు మెకానిక్ షెడ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 7 కార్లు దగ్ధం కాగా .. కారులో నిద్రిస్తున్న ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడిని సెక్యూరిటీ గార్డు సంతోష్గా గుర్తించారు. అగ్ని ప్రమాదంతో పరిసర ప్రాంతాల్లోని ఇళ్ళలో దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ఈ ప్రమాదంపై కేసు నమో దు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.