PoliticsTelangana

ఒకే పార్టీ ఒకే వ్యక్తి ఈ సంఘటన అరుదైన విషయం…ఈటల రాజేందర్

Share with

1962 తర్వాత మూడవసారి ఒకే పార్టీ నుండి ఒకే వ్యక్తి ప్రధాని కావడం చాలా అరుదైన విషయమని బీజేపీ పార్టీ నుండి ఎంపీగా గెలుపొందిన ఈటల రాజేందర్ పేర్కొన్నారు. దీనికంతటికీ ప్రధాని మోదీ కృషే కారణమయ్యారు. యావత్తు దేశప్రజలు తమ ఆత్మను ఆవిష్కరించి ఓట్లు వేశారని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ 2014లో, 2019లో చేసిన అభివృద్ధికి ప్రజలు ఎంతగానో సంతోషించి మూడవసారి కూడా అధికారం అప్పజెప్పారని ఆయన చెప్పారు. దేశంలోనే పెద్ద నియోజక వర్గమైన మల్కాజ్ గిరి నుండి మూడున్నర లక్షల మెజారిటీతో తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. తాను గతంలో రాష్ట్రంలో మంత్రిగా కొనసాగినప్పటికీ, కేంద్ర ప్రభుత్వంతో కలిసి మోదీ నాయకత్వంలో లోక్‌సభలో ఎంపీగా కొనసాగడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. దేశంలోని పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, తెలిపారు.