ఆఫ్ క్యాంపస్లకు ఈసారి అనుమతి లేనట్లే!
హైదరాబాద్: కొన్ని నిర్దిష్ట నిబంధనల మేరకు కళాశాలలు ఆఫ్ క్యాంపస్లు ఏర్పాటు చేసుకోడానికి ఎఐసిటిఈ అనుమతులు ఇస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని 4 కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో బీవీఆర్ఐటి, వర్ధమాన్, కెఎంఐటి, జయప్రకాష్ నారాయణ్ (మహబూబ్నగర్) కాలేజీలున్నాయి. హైదరాబాద్లో మరో క్యాంపస్ ఏర్పాటుకు ఆ కాలేజీలలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. వాటికి AICTE నుండి అనుమతులు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కావాలి.