వైభవంగా తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతుత్సవాలు -రాజేంద్రప్రసాద్కు సత్కారం
తెనాలిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఎన్టీఆర్ శతజయంతుత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఈ సందర్భంగా విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్కు సత్కారం చేసారు. ఎన్టీఆర్ అవార్డును రాజేంద్రప్రసాద్కు అందజేశారు. రామారావును మించిన నటులు ఎవరూ లేరని, నటనలో ఎన్నో ప్రయెగాలు చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. తనకు ఎన్టీఆర్ బహుమతి రావడం గొప్ప అనుభూతి కలిగిస్తోందన్నారు. రామారావు గారి ఇంట్లోనే తాను పుట్టడం తన అదృష్టం అన్నారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఎన్టీఆర్ ప్రజల మనస్సులో ఉంటారన్నారు.