Andhra PradeshHome Page Slider

ఇకపై ఏపీలో రౌడీయిజం చేస్తే ఊరుకోము:సీఎం చంద్రబాబు

Share with

ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించిన విషయం తెలిసిందే. కాగా ఈ పర్యటనలో చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో కూల్చివేసిన ప్రజావేదిక నుంచి తన పర్యటనను ప్రారంభించి దానిని పరిశీలించారు.  ఆ తర్వాత రాజధానికి శంకుస్థాపన చేసిన స్థలాన్ని సందర్శించారు. అంతేకాకుండా రాజధాని నగరంలో పలువురు ప్రభుత్వ అధికారులకు కేటాయించిన క్వార్టర్స్‌తోపాటు రాజధానిలో నిర్మాణ మధ్యలో ఆగిపోయిన భవనాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో సీఎం ఈ రోజు మధ్యహ్నం తన పర్యటనపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రౌడీయిజాన్ని ఇక ఏ మాత్రం సహించబోమని సీఎం హెచ్చరించారు. కాగా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో దౌర్జన్యాలు చేశారని..ఇకపై ఎవరి ఆటలు సాగనివ్వబోమని అన్నారు. రాష్ట్రంలో రాజకీయాలను అడ్డంపెట్టుకుని రౌడీయిజం చేస్తే నిర్మొహమాటంగా అణిచివేస్తానని సీఎం వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ అధికారులు తప్పు చేసిన ఉపేక్షించబోమన్నారు. కాగా రాష్ట్రాన్ని ఉన్మాది పాలన నుంచి దేవుడే కాపాడాడని సీఎం చంద్రబాబు  వెల్లడించారు.