Home Page SliderNational

మళ్లీ బీజేపీతో నితీష్ కుమార్ పొత్తు

Share with

బీహార్ సీఎం నితీశ్ మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకోనున్నారు. ఇందుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇటీవల బీజేపీని కాదని, ఆర్జేడీ, కాంగ్రెస్,సీపీఐతో కలిసి పనిచేసిన నితీష్ కుమార్ ఇప్పుడు తిరిగి బీజేపీ ఫోల్డ్ లోకి రాబోతున్నారు. ఇందుకు సంబంధించి డీల్‌ పూర్తయినట్లు తెలుస్తోంది. బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకునేందుకు బీహార్ సీఎం నితీశ్ నాలుగోసారి యూ టర్న్ తీసుకోనున్నారు. సుశీల్‌కుమార్‌ మోడీ బీహార్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. నితీష్ సీఎం పదవికి రాజీనామా చేసి తాజాగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. జేడీయూ ఎమ్మెల్యేలందరినీ పాట్నాకు పిలిచారు. కాంగ్రెస్ మొండి వైఖరి వల్లే నితీష్ తిరిగి బీజేపీకి దగ్గరైనట్టు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటల తర్వాత న్యూఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాలతో అమిత్ షా సమావేశం కానున్నారు.