నీలోఫర్ ఆసుపత్రిలో మొదటి కోవిడ్ కేసు నమోదు
రెడ్హిల్స్: నీలోఫర్ ఆసుపత్రిలో మొదటి కోవిడ్ కేసు నమోదైంది. నాలుగైదు రోజుల క్రితం తీవ్రమైన జ్వరం. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతూ.. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 14 నెలల చిన్నారిని వెంటిలేటరుపై తీసుకొచ్చారు. అనంతరం చికిత్స చేస్తున్నారు. అనుమానం వచ్చి కోవిడ్ పరీక్ష చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. చిన్నారికి నీలోఫర్ ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం కుదుటపడిందని, వెంటిలేటర్ను తొలగించి ప్రస్తుతం ఆక్సిజన్ సాయంతో చికిత్స చేస్తున్నామని ఆసుపత్రి వైద్యాధికారి తెలిపారు.