NationalNews

దేశంలోని పలు రాష్ట్రాలలో ఎన్‌ఐఏ సోదాలు

Share with

న్యూఢిల్లీ, మనసర్కార్

ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని 5 రాష్ట్రాలలో ఈ ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. కాగా జమ్ముకాశ్మీర్,హర్యానా,పంజాబ్,రాజస్థాన్,బీహార్‌లో రాష్ట్రాలలో ఎన్ఐఏ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్ విక్రయదారుల కోసం ఎన్ఐఏ ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల డ్రగ్స్‌ను పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.  దాదాపు  196 డ్రోన్లతో డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్ఐఏ అధికారులు పెద్దఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు భారతదేశంలో పాకిస్థాన్ దురాగత చర్యలను తిప్పికొట్టే విధంగా ఎన్ఐఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు.