Andhra PradeshNews

రైలుకింద పడి నవ దంపతుల ఆత్మహత్య

Share with

కడపలోని ఒక ఘోర విషాదం జరిగింది. రైలు కింద పడి ఒక జంట ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లైన ఏడాదికే వారికి నూరేళ్లూ నిండిపోయాయి. నిన్న రాత్రి (ఏప్రిల్ 8) కడప శివారులోని కనుమపల్లి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు ఈ దంపతులు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడపలోని విజయదుర్గా కాలనీకి చెందిన సాయికుమార్, హేమమాలినిలకు గత ఏడాది వివాహమైంది. హేమమాలిని 8 నెలల గర్భవతి. సాయికుమార్ రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. వీరు గత కొద్ది రోజులుగా ఆర్థికసమస్యలతో బాధలు పడుతున్నట్లు సమాచారం. వీరి మృతికి ప్రధానంగా ఆర్థికపరమైన కారణాలే కారణమని తెలుస్తోంది. ఇంకేమైనా సమస్యలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి మృతదేహాలను కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు.